టీడీపీ పై కక్ష సాధించేందుకే ఇటువంటి చర్యలు

టీడీపీ పై కక్ష సాధించేందుకే ఇటువంటి చర్యలు
x
Highlights

ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చేస్తామనడం సరికాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కరకట్టపై అనేక కట్టడాలు ఉన్నాయని...

ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చేస్తామనడం సరికాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కరకట్టపై అనేక కట్టడాలు ఉన్నాయని వాటన్నిటినీ కూల్చేస్తారా అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ టీడీపీ పై కక్ష సాధించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గత యాభై ఏళ్లలో ప్రజా వేదిక నిర్మించిన ప్రాంతం ముంపునకు గురైన దాఖలాలు లేవని వెల్లడించారాయన. అక్రమ కట్టడం అని చెప్తున్న ప్రజావేదిక భవనంలో కలెక్టర్ల సదస్సు ఎలా నిర్వహించారని ప్రశ్నించిన బుచ్చయ్య చౌదరి ఇది ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories