అర్ధరాత్రి బీచ్‌ రోడ్డులో కారు యాక్సిడెంట్ చేసి పరారైన టీడీపీ నేత కొడుకు!

అర్ధరాత్రి బీచ్‌ రోడ్డులో కారు యాక్సిడెంట్ చేసి పరారైన టీడీపీ నేత కొడుకు!
x
Representational Image
Highlights

శనివారం రాత్రి విశాఖలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడి కారు బీభత్సం సృష్టించింది.

శనివారం రాత్రి విశాఖలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడి కారు బీభత్సం సృష్టించింది. బండారు కుమారుడు అప్పలనాయుడు తన వాహనంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అయితే ప్రమాదం అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు అప్పలనాయుడు. అయితే స్థానికులు గమనించి సత్యనారాయణ స్నేహితులను పట్టుకున్నారు. అందరు మద్యం సేవించి ఉండటంతో స్థానికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారికి దేహశుద్ది చేశారు. అప్పలనాయుడు మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడని స్థానికులు తెలిపారు. కాగా తాగిన మత్తులో కారును వేగంగా నడిపాడు అప్పలనాయుడు. ఈ క్రమంలో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారని..

వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కారు డివైడర్ పైకి ఎక్కి, పక్కనే ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాకిందని పోలీసులు తెలిపారు. అప్పలనాయుడు కారులో రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు సహా ప్రవీణ్, మౌర్య అనే మరో ఇద్దరు యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా బండారు అప్పలనాయుడు తండ్రి సత్యనారాయణ పెందుర్తి ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేశారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి అప్పలనాయుడు బావమరిది అవుతారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories