పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ

పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఇసుక కొరత కారణంగా భవననిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఇసుక కొరత కారణంగా భవననిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతు కోరారు. విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వెళ్లారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు.

కాగా గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు 'ఇసుక దీక్ష'ను చేపట్టనున్నారు చంద్రబాబు. విజయవాడలోని ధర్నా చౌక్ లో దీక్ష కొనసాగనుంది. దీక్షకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం తెలపడమే కాకుండా.. స్వయంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories