టీడీపీ నేతల దాడిపై న్యాయపోరాటం చేస్తా : ఎమ్మెల్యే శ్రీదేవి

టీడీపీ నేతల దాడిపై న్యాయపోరాటం చేస్తా : ఎమ్మెల్యే శ్రీదేవి
x
Highlights

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ...

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి,.

తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో తీవ్ర మన్థాపానికి గురైన శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

అయితే, టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

అయితే, ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషిస్తారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories