వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత

వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత
x
Highlights

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ టీడీపీ నేత వైవీ రామిరెడ్డి వైసీపీలో చేరారు.3 దశాబ్దాల రాజకీయానుభవం కలిగిన వైవీ...

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ టీడీపీ నేత వైవీ రామిరెడ్డి వైసీపీలో చేరారు.3 దశాబ్దాల రాజకీయానుభవం కలిగిన వైవీ రామిరెడ్డి తొలి నుంచీ టీడీపీలో కీలకమైన నేతగా ఉన్నారు. టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ రామిరెడ్డి శనివారం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటుగా పలువురు మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచులు ఆ పార్టీలో చేరారు. అలాగే రాష్ట్ర గౌడ సంఘం నేత ఉదయగిరి నరసింహులు గౌడ్, కాపునాడు రాష్ట్ర కోశాధికారి నరసింహారావు, టీడీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, నెల్లూరు మాజీ కార్పొరేటర్లు శ్రీధర్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితర నేతలకు కూడా జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Show Full Article
Print Article
Next Story
More Stories