ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? : నారా లోకేష్

ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? : నారా లోకేష్
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరోసారి ఓ రేంజిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేత నారా లోకేష్. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ మేరకు...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మరోసారి ఓ రేంజిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేత నారా లోకేష్. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో.. 'ఆంధ్రుల మనోభావాలంటే జగన్ గారికి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు.అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories