Galla Jayadev: మోడీ, అమిషాకు టీడీపీ నేత గల్లా జయదేవ్‌ లేఖ

TDP Leader Galla Jayadev Letter to PM Modi And Amit Shah
x
గల్లా జయదేవ్ (ఫైల్ ఇమెజ్)
Highlights

Galla Jayadev: ఏపీలో వరదలతో వాటిల్లిన నష్టంపై లేఖలో వివరాలు

Galla Jayadev: ఏపీలో వరదలతో భారీగా వాటిల్లిన నష్టం పై ప్రధాని మోడి, హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్‌ లేఖ రాసారు. తుఫాను కారణంగా రాయలసీమలో భారీగా ప్రాణనష్టం, పంటనష్టం జరిగిందని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఆర్థిక కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అలాగే రైలు, రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బ తిని రవాణా స్తంభించిందని వివరించారు. వెంటనే వాటిన పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారీగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరిన గల్లా జయదేవ్‌ తుఫానును జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఈ లెఖలో విజ్ఞప్తి చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories