నేడు వైసీపీలోకి అవినాష్.. ఆ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చే ఛాన్స్..

నేడు వైసీపీలోకి అవినాష్.. ఆ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చే ఛాన్స్..
x
Highlights

టీడీపీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జగన్ ను కలిసి వైసీపీ తీర్ధం...

టీడీపీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జగన్ ను కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అనంతరం వైసీపీ కార్యాలయం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ మారేందుకు గల కారణాలను ఆయన వివరించనున్నారు. మరోవైపు అవినాష్ ఎంట్రీతో ఎవరి సీటుకు ముప్పుస్తోందో అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.

అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ గా అవినాష్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే అక్కడ బొప్పన భవకుమార్ ఉన్నారు. ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి తూర్పు బాధ్యతలను అవినాష్ కు అప్పజెప్పాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories