బస్సులను కూడా వదిలి పెట్టారా? జగన్ సర్కార్ తీరుపై మాజీ మంత్రులు ఫైర్

బస్సులను కూడా వదిలి పెట్టారా? జగన్ సర్కార్ తీరుపై మాజీ మంత్రులు ఫైర్
x
Highlights

ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ జిల్లాలో గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కగా .. ఆర్టీసీ బస్సులకు వైసీపీ జెండాను పాలైన రంగులు వేశారని ఆరోపించారు. మద్దెలపాలెం డిపోకు చెందిన బస్సుకు గతంలో ఉన్న రంగులు మార్చారని మంత్రులు ఆరోపించారు. ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ రంగులు వేయడం ఏంటిని విమర్శించారు. నీచ రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ప్రభుత్వం బస్సులకు కూడా వైసీపీ జెండాను పోలిన రంగులు వేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేశారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం న్యాయస్థానాల దృష్టికి వెళ్ళింది. కోర్టులు రంగులు తొలగించాలని ఆదేశించడంతో, మళ్లీ రంగులు మారుస్తూ ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. అదనంగా మరో రంగు మాత్రమే చేర్చించిందని ఆరోపిస్తూ మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీనిని కోర్టు రిజర్వుల్లో పెట్టింది. గతంలో టీడీపీ హయాంలో ఆర్టీసీ బస్సులకు పసుపు రంగు వేశారని, పల్లె వెలుగు పేరు మారుస్తూ.. తెలుగు వెలుగు అని పెట్టారని వైసీపీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories