టీడీపీ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ బీజేపీ ఇంచార్జ్

టీడీపీ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ బీజేపీ ఇంచార్జ్
x
Highlights

టీడీపీ పెనం మీద నుంచి పొయ్యిలో.. టీడీపీ పెనం మీద నుంచి పొయ్యిలో..

ఎట్టిపరిస్థితుల్లోను టీడీపీ పార్టీతో బీజేపీ జత కట్టదని తేల్చేశారు.. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ ధియోధర. రాబోయే స్థానిక సంస్థలో కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు వైసీపీ, జనసేన పార్టీలతోనూ పొత్తులుండవని చెప్పారు. టీడీపీకి బీజేపీకి శాశ్వత ద్వారాలు మూసుకుపోయాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి దిశలేదని.. ఆ పార్టీకి లీడర్ లేరు, ఆశలు లేవని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరియు కొందరు లీడర్ల అవినీతి కారణంగా..

ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్నికోల్పోయిందని చెప్పారు. టీడీపీ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుందని అన్నారు. అలాగే ఏపీ బీజేపీ బృందం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి నివేదిక తయారు చేసిందని.. సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి షెకావత్ ను కలిసి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. కాగా కేంద్రం ప్రభుత్వంతో వైరం పెట్టుకొని బాగా నష్టపోయామని చంద్రబాబు అన్న రెండు రోజుల్లోనే ఏపీ బీజేపీ ఇంచార్జ్ టీడీపీతో పొత్తు లేదని తేల్చి చెప్పడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories