బీజేపీలో చేరాలని ఆహ్వానం అందింది.. టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలో చేరాలని ఆహ్వానం అందింది.. టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Jc diwakar reddy
Highlights

కాంగ్రెస్‌ హాయం నుంచి బీజేపీలో చేరాలని ఆ పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం ఉందన్నారు టీడీపీ మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ హాయం నుంచి బీజేపీలో చేరాలని ఆ పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం ఉందన్నారు టీడీపీ మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కార్యకర్త వరకు తనను ఆ పార్టీ లోకి రావాలని కోరుతున్నారని బాంబ్ పేల్చారు. బీజేపీలో చేరికపై వచ్చిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. గతంలో నడ్డాను ఆహ్వానాన్ని ఎన్నోసార్లు సున్నితంగా తిరస్కరించానన్నారు.తన కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని

రాష్ట్రంలో తమకంటూ ఒక ఇమేజ్ ఉందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోమని అన్నారు. ఇక సొంత నియోజకవర్గమైన తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పాలన బావుందన్న ఆయన ఎంతో కృషి చేస్తున్నారంటూ జెసి వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. జేసీ బీజేపీలోకి ఇటీవలే ప్రచారం జరిగింది. దీని వెనుక కారణాలు లేకపోలేదు.

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని తోపాటు అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లారు. జూటూరులోని జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో 4 గంటల పాటు ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు పరిశీలించారు. వీరు ప్రస్తుత కరోనా మహమ్మారి గురించి,వ్యవసాయ రంగం గురించి చర్చించారని టాక్.

ఇక కరోనా వైరస్ అంశంపైనా స్పందించారు జెసి. ఈ వైరస్ రాష్ట్రానికే పరిమితం కాలేదని ప్రపంచం మొత్తం వ్యాపించిందని దివాకర్‌రెడ్డి అన్నారు. ఏపీలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని.. అలాగని సంబర పడాల్సిన అవసరం లేదని, పూర్తిగా లేకపోయినా కూడా తేలికగా తీసుకోకూడదన్నారు. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కరోనా భయం అందరికి ఉందన్నారు జేసీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories