టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. బాలయ్య స్నేహితుడు కూడా వైసీపీలోకి ?

టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. బాలయ్య స్నేహితుడు కూడా వైసీపీలోకి ?
x
BABU RAO FIle Photo
Highlights

స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు అందరూ అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్నారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు అందరూ అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీకి మరో షాక్ తగలనుంది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబూరావు వైసీపీలో చేరేందుకు సిద్దమైయ్యారు. మరికాసేపట్లో బాబూరావు టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. జగన్‌తో భేటీ కాబోతున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కదిరి బాబూరావు 2019 ఎన్నికల్లో నుంచి పోటీచేసి వైఎసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో పరాజయం పాలైయ్యారు. కదిరి బాబూరావు పార్టీ వీడతారంటూ రెండు, మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో వీపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో ఆయన స్పందించారు..పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు. బాలకృష్ణ కోసం రాజకీయాల్లోకి వచ్చానని..బాలకృష్ణ, తాను చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులమని ఆ‍యనతోనే ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories