టీడీపీపై వంశీ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక మీటింగ్

టీడీపీపై వంశీ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక మీటింగ్
x
Highlights

టీడీపీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధమైనట్టు

టీడీపీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పరిస్థితులను చక్కదిద్దెందుకు నేరుగా అధినేత చంద్రబాబే ముందుకు వచ్చారు.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారంతో చంద్రబాబు వారితో మాట్లాడారని తెలుస్తోంది. జంపింగ్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ముఖ్యులతో చంద్రబాబు ఇవాళ కీలక మీటింగ్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు ఆయన కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. రాష్ట్రంలో పరిస్థితులు, రాజధానిపై వైసీపీ వైఖరిపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories