చంద్రబాబు పాదయాత్ర.. డీజీపీ ఆఫీస్‌ ముందు బైఠాయింపు

చంద్రబాబు పాదయాత్ర.. డీజీపీ ఆఫీస్‌ ముందు బైఠాయింపు
x
Chandra babu Protest
Highlights

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ...

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర డీజీపీ కార్యాలయం వరకు పలువురు నేతలతో కలిసి ఈ పాదయాత్ర కొనసాగింది.

దాడిలో గాయపడిన బుద్దా వెంకన్న, బొండా ఉమాతో పాటు దెబ్బతిన్న వాహనాలతో ర్యాలీగా చంద్రబాబు డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే చంద్రబాబు సహా పార్టీ నేతలెవరూ.. లోపలికి ప్రవేశించకుండా పోలీసులు గేటును మూసివేశారు. దీంతో చంద్రబాబు సహా నేతలంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు వద్దకు అదనపు డీజీ రవిశంకర్‌ వచ్చి చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.

మాచర్లలో జరిగిన దాడి గురించిన వివరాలను చంద్రబాబు వివరించారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమా తమకు తగిలిన గాయాలను డీజీ రవిశంకర్‌కు చూపించారు. అనంతరం దెబ్బతిన్న కార్లను దాడి జరిగిన తీరును చంద్రబాబు సహా నేతలు డీజీకి రవిశంకర్‌కు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories