నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా టీడీపీ

నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా టీడీపీ
x
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Highlights

నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుందని.. కానీ ఈరోజు అమరావతి రైతులు సంతోషంగా లేరని.. దాంతో వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చాం అని చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ సందర్బంగా న్యూ ఇయర్ వేడుకలకయ్యే ఖర్చులను రైతులకోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జెఎసిలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలని.. ఈ నూతన సంవత్సరంలో అన్నివర్గాల ప్రజల ధన,మాన,ప్రాణాలకు భద్రత ఏర్పడాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయంతో చాలా చోట్ల టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు మాత్రం కార్యకర్తలు జరిపే వేడుకల్లో పాల్గొనటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories