చంద్రబాబు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

చంద్రబాబు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
x
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్బంగా నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. సాక్షాత్తు చంద్రబాబు...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్బంగా నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. సాక్షాత్తు చంద్రబాబు ఎదుటే ఒక నేతపై మరో నేత అనుచరులు గొడవకు దిగారు. అధినేత సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. కడప పర్యటనలో భాగంగా చంద్రబాబు రెండవరోజు స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల,

మైదుకూరు నియోజకవర్గాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో 15వ డివిజన్ ఇన్‌చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతనివల్లే పార్టీ ప్రతిష్టత దిగజారిందని ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి అనుచరులు.. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. చంద్రబాబు సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అధినేత ఇద్దరు నేతలను మందలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories