తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్బంగా నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. సాక్షాత్తు చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్బంగా నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. సాక్షాత్తు చంద్రబాబు ఎదుటే ఒక నేతపై మరో నేత అనుచరులు గొడవకు దిగారు. అధినేత సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. కడప పర్యటనలో భాగంగా చంద్రబాబు రెండవరోజు స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల,
మైదుకూరు నియోజకవర్గాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో 15వ డివిజన్ ఇన్చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతనివల్లే పార్టీ ప్రతిష్టత దిగజారిందని ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి అనుచరులు.. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. చంద్రబాబు సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అధినేత ఇద్దరు నేతలను మందలించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire