వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి కంపెనీకి శంకుస్థాపన చేసిన రోజా

వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి కంపెనీకి శంకుస్థాపన చేసిన రోజా
x
Highlights

వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి కంపెనీకి శంకుస్థాపన చేసిన రోజా

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో అంతర్జాతీయ తయారీదారు కంపెనీ TCLకి శంకుస్థాపన చేశారు APIIC ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైనాకు చెందిన TCL కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా TCL కంపెనీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో భాగంగా రెండు విభాగాలను 2,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది.

కంపెనీ ప్రారంభం అనంతరం రోజా మాట్లాడుతూ.. 'ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ TCL ఆంధ్ర ప్రదేశ్ లో 2,200 కోట్లతో తిరుపతిలో రెండు కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చింది. జగనన్న ఆశీస్సులతో APIIC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది.' అని రోజా పేర్కొన్నారు. ఇదిలావుంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కంపెనీ ఇదే కావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories