ఏపీ స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేషన్‌

ఏపీ స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేషన్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేషన్‌ దాఖలు చేశారు. తమ్మినేని అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు...

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేషన్‌ దాఖలు చేశారు. తమ్మినేని అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఆముదాలవలస నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తమ్మినేని ఏపీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అధికారికంగా రేపు స్పీకర్‌‌‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికకానున్న తమ్మినేని సీతారాంను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories