ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 31 వరకు రాయితీ ఉల్లి అమ్మకాలు

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31 వరకు రాయితీపై ఉల్లిపాయల విక్రయ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంటుందని సెక్రెటరీ వి సతీష్ కుమార్ మీడియాకి తెలిపారు.

S. Srikanth
Published on: 14 Dec 2019 11:17 AM IST
ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 31 వరకు రాయితీ ఉల్లి అమ్మకాలు
X
ఏఎమ్సి స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ వి సతీష్ కుమార్

బొబ్బిలి: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31 వరకు రాయితీపై ఉల్లిపాయల విక్రయ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంటుందని బొబ్బిలి ఏఎమ్సి స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ వి సతీష్ కుమార్ మీడియాకి తెలిపారు. ఈ రోజు బొబ్బిలి ఏ ఎమ్ సి కార్యాలయం ఆవరణంలో 2 కౌంటర్ల ద్వారా ఇంచుమించు 2 టన్నులు ఉల్లిని ప్రజలకు సబ్సిడీ ద్వారా ప్రజలకు అందించినట్టు తెలిపారు. ఇంచుమించు 1800 కుటుంబాలు ఈ రోజు సబ్సిడీ ఉల్లి కొనుగోలు చేసినట్టు తెలిపారు.

ప్రతి రోజు స్టాక్ సౌలభ్యం బట్టి ప్రతి కుటుంబానికి ఒక కేజీ ఉల్లిపాయలు 25 రూపాయలకే అందించనున్నట్టు తెలిపారు. ఉదయం 6:30 నుంచి స్టాక్ పూర్తి అయ్యేవరకు అమ్మకాలు కొనసాగుతాయని తెలిపారు. ఆధార్ లేదా రేషన్ కార్డు తీసుకురావాలని ప్రజలను కోరారు.

S. Srikanth

S. Srikanth

Next Story