Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఎన్నికల వేళ విచిత్రమైన సంఘటన

Strange Incident During an Election in Kurnool District
x

Representational Image

Highlights

Andhra Pradesh: ప్రచారంలో ఎదురు పడిన అధికార, ప్రతిపక్షా నేతలు * కుశల ప్రశ్నలు సంధించుకున్న ప్రత్యర్థులు

Andhra Pradesh: ఎన్నికల్లా సీత్రాలు జోర్ధార్ వుంటాయి గెలుపు కోసం ఎన్ని వేషాలు వేయలే ఎన్ని తిప్పలు పడాలే ఇక ప్రత్యర్థులను మట్టి కరిపినీకే కూడా కష్టాలు పడాలే ప్రచారంల ఇవి కామన్ కానీ బద్ద శత్రువులైన పార్టీ అభ్యర్థులు ప్రచారంల ఎదురు పడితే... ఇంకేంటి రచ్చే.... కానీ ఇక్కడ ముచ్చట మరో లెక్క వుంది అదేందో మీరు చూడండి.

అసలే అది కర్నూలు.. అందులో కార్పొరేషన్ ఎన్నికలు. అధికారపక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నీవా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ప్రచార హోరు లో సైతం ఒకరిని మించి మరొకరు దూసుకుపోతున్న పరిస్థితి లేకపోలేదు ఈ క్రమంలో ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్ధులు, కార్యకర్తలు ఎదురుపడ్డారు ఇంకేముంది పెద్ద రచ్చే అవుతుందనుకున్నారు. కానీ, అలాంటిది ఏం జరగలేదు.

ప్రచారం చూసుకునే చోటు ప్రచారంలో ఇరు పార్టీల నేతలు ఒకే ప్రాంతంలో ఉంటే గొడవ తప్పదు. కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరినొకరు బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది చూసిన కర్నూలు వాసులు అవక్కయ్యారు.

ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ ప్రచారం చూస్తున్న ప్రాంతంలోనే టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నప్పుడు ఈ సీన్ చోటు చేసుకుంది. అగ్ర నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు కార్యకర్తలు మాత్రం గొంతు చించుకుని తమ పార్టీకే ఓటు వేయమంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేసారు.

పొద్దున లేస్తే పడుకునే దాక ఒకళ్ళనొకళ్ళు తీట్టుకునే నేతలు ఇట్ల కలిసి పోయిండ్రు ఇదేమి చిత్రం అంటూ జనం చూసి విస్తూపోయిండ్రు ఇక తల పండిన వారు మాత్రం అవే బ్రదర్ పోలీట్రిక్స్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories