ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారుల కీలక నిర్ణయం

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారుల కీలక నిర్ణయం
x
Highlights

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగించారు. డిసెంబర్ లో ముగింపునకు బదులుగా వచ్చే ఏడాది జనవరి 26 వరకు సర్వీసును కొనసాగించాలని నిర్ణయించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. డిసెంబర్ 22 నుండి 31 వరకు మళ్ళీ జనవరి 1, 4 మరియు 5 తేదీలతో పాటు 11 నుండి 19 వరకు ఆ తరువాత 24 నుండి 26 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయి.

రైలు నెం: 08517 విశాఖపట్నం-అరకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. రైలు నెం: 08518 అరకు-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2:30 గంటలకు అరకు నుండి బయలుదేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories