ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ మీదుగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
కొంతకాలంగా విజయవాడ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోయింది. దాంతో రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ప్రకటించింది. ఈ మేరకు పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్ – కాకినాడటౌన్ ప్రత్యేకరైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే రైలునెంబరు (07054) కాకినాడటౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. రైలునెంబరు (07255) నరసాపూర్– సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైలునెంబరు (07256) సికింద్రాబాద్–నరసాపూర్ ప్రత్యేకరైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 6.05కు నరసాపూర్ కు చేరుకుంటుంది. రైలునెంబరు (07255) నరసాపూర్ – సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 5.50కు సికింద్రాబాద్ కు చేరుకుంటుందని విజయవాడ రైల్వే డివిజన్ వెల్లడించింది. ఈ రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire