సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సమన్లు

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సమన్లు
x
Highlights

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి పోలీసులు సమన్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన...

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి పోలీసులు సమన్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇడిమేపల్లికి చెందిన కొందరు రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. కాగా ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అమ్మేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కోర్టు ఆదేశాలతో ఏ1 ముద్దాయిగా సోమిరెడ్డిని చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories