పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు : సీతారాం ఏచూరి

పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు : సీతారాం ఏచూరి
x
Highlights

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) ప్రక్రియను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం వెంటనే ప్రకటన చేయాలనీ...

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) ప్రక్రియను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం వెంటనే ప్రకటన చేయాలనీ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎన్‌ఆర్‌సి అమలుకు ఎన్‌పిఆర్‌ మొదటి అడుగు అని ఆయన అన్నారు. శనివారం కర్నూలు ఉస్మానియా కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. మోడీ-షా ద్వయం ఆడిన విభజన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఏచూరి అన్నారు. 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఎన్‌ఆర్‌సిని అమలు చేయమని ప్రకటించారని గుర్తుచేశారు.

మరిన్ని రాష్ట్రాలు దీన్ని అనుసరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. శాంతియుత నిరసనకారులపై కొందరు దాడులు జరుపుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికె అవమానం అని అన్నారు. సీఏఏ మరియు ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరసన ప్రజల ప్రాథమిక హక్కు, కాని ఈ హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. దేశంలో పౌరసత్వానికి మతం ఎప్పుడూ ప్రాతిపదిక కాదని హితవు పలికారు. కాగా సభకు ముందు పౌరసత్వం (సవరణ) చట్టానికి నిరసనగా కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories