AP High Court: ఏపీ సర్కార్ కి షాకిచ్చిన హైకోర్టు

Shock to AP Government in Sangam Dairy Case
x

సంగం డైరీ కేసులో ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్ 

Highlights

AP High Court: సంగం డెయిరీ స్వాధీనంపై ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

AP High Court: సంగం డెయిరీ స్వాధీనంపై ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీ కేసులో అరెస్టు అయిన టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. విచార‌ణ‌పై స్టే ఇవ్వాల‌ని ధూళిపాళ్ల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోరారు. డెయిరీ స‌మాచారాన్ని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు పోలీసులు ఇస్తున్నార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు చెప్పారు. ధూళిపాళ్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో విచార‌ణ జ‌ర‌ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని సీఐడీ తెలిపింది.

కాగా, క‌స్ట‌డీ పొడిగింపు అంశంపై అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.అనంత‌రం, సంగం డెయిరీ విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవోను ర‌ద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్ట‌ర్లు వేసిన పిటిష‌న్‌పై కూడా విచార‌ణ జ‌రిగింది. సంగం డెయిరీని ప్ర‌భుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. డైరెక్ట‌ర్లు సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాదు, ఆ డెయిరీ స్థిర‌, చ‌రాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల‌ని ఆదేశించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్ట‌ర్ల‌కే ఉంటుంద‌ని తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జూన్ 17కు వాయిదా వేస్తున్న‌ట్లు హైకోర్టు వెల్ల‌డించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories