ప్రేమ పేరుతో మోసం, మోజు తీరాక మరో వివాహం.. పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ ఎమ్మెల్యే

ప్రేమ పేరుతో మోసం, మోజు తీరాక మరో వివాహం.. పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత భార్యను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు.దాంతో...

చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత భార్యను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు.దాంతో మొదటి భార్య స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించింది. ఆయన ఆమెకు న్యాయం చెయ్యాలని కోరుతూ డిఎస్పీని కలిశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. నెల్లూరు నావాబ్‌పేటకు చెందిన మైనర్‌ ఇంటర్మీడియేట్‌ చదువుతోంది. స్నేహితురాలు వివాహానికి వలేటివారిపాలెం మండలం శింగమనేనిపల్లి గ్రామానికి వెళ్ళింది. దాంతో ఆదే గ్రామానికి చెందిన వెంకటసురేంద్రతో ఆమెకు పరిచయం ఏర్పాడి ప్రేమగా మారింది. వెంకటసురేంద్ర ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే మూడేళ్ల కిందట ఆమెను చెన్నైకి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.

అనంతరం కందుకూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా జన్మించిన బిడ్డ మృతి చెందింది. రెండవ సారి మరో బిడ్డకు జన్మనించింది. ఆ తర్వాత సురేంద్ర తనను చిత్రహింసలు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలు చెప్పారు. దాంతో వేధింపులు తాళలేక నెల్లూరులోని అమ్మమ్మ వద్దకు వచ్చింది. ఇదిలావుండగా సురేంద్ర నాలుగు రోజుల కిందట మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మొదటి భార్య సురేంద్ర ఇంటికి వెళ్లి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది. వారు పట్టించుకోకపోవడంతో బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే బాలికతో డీఎస్పీ రవిచంద్రను కలిశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories