ఏపీ గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ

Samba Siva Rao
Published on: 8 Feb 2021 6:24 PM IST
ఏపీ గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ
X

నిమ్మగడ్డ ఫైల్ ఫోటో 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. సుమారు అర్థగంట పాటు వీరి భేటీ కొనసాగింది. రేపు తొలివిడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాజా పరిస్థితులు, ఉన్నతాధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌తో ఎస్‌ఈసీ చర్చించినట్లు సమాచారం. మరోవైపు పోలింగ్ కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 జిల్లాల్లోని 2,724 సర్పంచ్‌ స్థానాలు, 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 18 వేల 608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, ఎనిమిది వేల 503 మధ్యరకం, 21 వేల 338 చిన్న బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story