కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

* మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించిన ఎస్‌ఈసీ * ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు

Sandeep Eggoju
Published on: 6 Feb 2021 1:20 PM IST
SEC Nimmagadda Ramesh issued the key directives
X

ఫైల్ ఇమేజ్

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగిస్తాయని ఎన్నికలు సజావుగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

అయితే తమకు ఎన్నికల కమిషనర్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. తాను రాజకీయాలు మాట్లాడనని. వ్యక్తిగత విషయాలపై జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story