రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధి : తమ్మినేని సీతారాం

రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధి : తమ్మినేని సీతారాం
x
Tammineni Sitaram
Highlights

ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ‎ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో ప్రజలు...

ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ‎ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంటిసాకులతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరును ప్రజలంతా తప్పుబడుతున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉండాలని జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు చేయాలన్నారు. 'ఇది కరోనా వైరసా.. కమ్మోనా వైరాసా..' అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories