రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధి : తమ్మినేని సీతారాం
ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ప్రజలు...
ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంటిసాకులతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరును ప్రజలంతా తప్పుబడుతున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉండాలని జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు చేయాలన్నారు. 'ఇది కరోనా వైరసా.. కమ్మోనా వైరాసా..' అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని కోరారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire