వైసీపీలో చేరనున్న టీడీపీ రెబల్ అభ్యర్థి

వైసీపీలో చేరనున్న టీడీపీ రెబల్ అభ్యర్థి
x
Highlights

టీడీపీ సీనియర్ నేత, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం.సురాజ్‌ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.1983, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సురాజ్‌...

టీడీపీ సీనియర్ నేత, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం.సురాజ్‌ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.1983, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సురాజ్‌ 1997లో లక్ష్మీపార్వతి పార్టీలో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్‌, బీజేపీల్లోకి వెళ్లారు.కాంగ్రెస్ లో ఉంటూనే వైసీపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీ నేత ఆదిమూలం ఆయన ప్రయత్నాలకు గండికొట్టారు. దీంతో గతనెల 15వ తేదీన నెల్లూరులో ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సత్యవేడు టీడీపీ అబ్యర్థిగా జేడీ రాజశేఖర్‌ను టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ పరిణామంతో సురాజ్‌ టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీలో చేరి నెల రోజులు కూడా కాకముందే ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories