సత్తెనపల్లిలో మెత్తబడ్డ అసమ్మతి వర్గం.. అంబటికి..

సత్తెనపల్లిలో మెత్తబడ్డ అసమ్మతి వర్గం.. అంబటికి..
x
Highlights

సత్తెనపల్లి వైసీపీలో కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. పార్టీ ఇంచార్జ్ అంబటి రాంబాబు తమకు కలుపుకుని పోవడం లేదంటూ ఓ వర్గం ఆయనపై గుర్రుగా ఉంది. ఇటీవల అసమ్మతి...

సత్తెనపల్లి వైసీపీలో కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. పార్టీ ఇంచార్జ్ అంబటి రాంబాబు తమకు కలుపుకుని పోవడం లేదంటూ ఓ వర్గం ఆయనపై గుర్రుగా ఉంది. ఇటీవల అసమ్మతి వర్గం సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ వ్యవహారం అధిష్టానం వరకూ వెళ్ళింది. దాంతో రంగంలోకి దిగిన అగ్రనేతలు అసమ్మతి వర్గాన్ని హైదరాబాద్‌కు పిలిపించి చర్చింనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అధిష్టానం ఎట్టకేలకు పరిస్థితిని సద్దుమణిగేలా చేసింది. ఏవైనా పొరపాట్లు ఉంటే సర్దుకు పోవాలని సూచించింది. అధిష్టానం సూచనతో మెత్తబడ్డ ఆ వర్గం అంబటికి సహకరిస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories