తిరుపతిలో విషాదం...వ్యాక్సిన్‌ వికటించి శానిటరీ వర్కర్‌ మృతి

Sanitary Worker Lost his Life After Corona Vaccination in Tirupati
x

Representational Image

Highlights

* వ్యాక్సినేషన్‌ అనంతరం కుప్పకూలిన కృష్ణయ్య * ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ వికటించి శానిటరీ వర్కర్‌ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్‌ కాలనీకి చెందిన కృష్ణయ్య కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య కన్నుమూశాడు. వ్యాక్సిన్‌ వేయించుకుని 24 గంటలు గడవకముందే కృష్ణయ్య మృతి చెందాడని ఆరోపిస్తున్నారు బంధువులు. వ్యాక్సిన్‌ వద్దన్నా బలవంతంగా వేయించారని, అందువల్లే చనిపోయాడని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories