Sabbavaram: దుర్గమాంబ ఆలయంలో చోరీ

Sabbavaram: దుర్గమాంబ ఆలయంలో చోరీ
x
Durgamamba Temple in Sabbavaram
Highlights

స్థానిక దుర్గమాంబ ఆలయంలో దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు.

సబ్బవరం: స్థానిక దుర్గమాంబ ఆలయంలో దుండగులు రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో హుండీలను అపహరించారు. ఆలయ అర్చకులు రేజేటి చంద్రశేఖర్‌ శర్మ రాత్రి 9 గంటల వరకు ఆలయంలో పూజలు చేసి యధావిధిగా అమ్మవారి గుడికి తలుపు వేసి వెళ్లిపోయారు. ఉదయం 6.30 గంటలకు అర్చకులు గుడితలుపు తీయడానికి వచ్చినప్పుడు తాళాలు పగలుగొట్టి తలుపులుతీసి ఉన్నాయి. అర్చకులు లోపలకు వెళ్లి చూడగా నాలుగు హుండీలు కనబడకపోవడంతో ఈ విషయాన్ని ఆలయ కమిటి సభ్యులకు సమాచారాన్ని అందించారు. సుమారు లక్ష రూపాయలు నగదు అపహారణకు గురైందని కమిటి సభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories