ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
x
Highlights

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కాటేసింది. పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు...

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కాటేసింది. పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా..ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు తిరుమలకి వెళ్లి తిరుగుపయనంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ సాంబారెడ్డి(44)తో పాటు పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్‌ (10) మృతి చెందారు. అనురాధ, సుప్రియ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories