లారీ ఢీ.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

లారీ ఢీ.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు
x
Highlights

తూర్పు గోదావరియళ్ళలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి...

తూర్పు గోదావరియళ్ళలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ బస్సులో 35 మంది దాకా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. కాకినాడ రూరల్‌ మండలం అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాజోలు నుండి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీ కాకినాడ పోర్టు నుంచి సత్తుపల్లి వెళ్తున్నట్టు సమాచారం. ప్రమాదస్థలినుంచి లారీ డ్రైవర్‌ పరారైనట్టు తెలుస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్‌ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories