అప్పన్న స్వామి వెండి విక్రయం ద్వారా రూ.3.34 కోట్ల ఆదాయం

అప్పన్న స్వామి వెండి విక్రయం ద్వారా రూ.3.34 కోట్ల ఆదాయం
x
సింహాద్రి అప్పన్న స్వామి
Highlights

సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వెండిని విక్రయించడం ద్వారా దేవస్థానానికి ఆదాయం సమకూరినట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వెండిని విక్రయించడం ద్వారా దేవస్థానానికి రూ.3,34,19,153 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులు హుండీలలో కానుకల రూపంలో సమర్పించిన వెండి దేవస్థానంలో నిరుపయోగంగా ఉంది.

వస్తు రూపంలో ఉన్న ఈ వెండిని ఇటీవల కరిగించి దిమ్మలుగా తయారు చేయించారు. సుమారు 1009.200 కిలోల వెండి దిమ్మలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ ఇ-వేలం ద్వారా విక్రయానికి పెట్టారు. ఇందులో ఎస్‌కే ఇంపెక్స్‌ అనే సంస్థ అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాలు, వెండి దిమ్మలను ఎంఎంటీసీ అధికారుల సమక్షంలో కొనుగోలు సంస్థ ప్రతినిధులకు ఈవో వెంకటేశ్వరరావు అప్పగించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories