బ్రేకింగ్ : మారిన నిర్ణయం.. విశాఖ టు విజయవాడ !

బ్రేకింగ్ : మారిన నిర్ణయం.. విశాఖ టు విజయవాడ !
x
బ్రేకింగ్ : మారిన నిర్ణయం.. విశాఖ టు విజయవాడ !
Highlights

ఏపీలో గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు, నేడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని...

ఏపీలో గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు, నేడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

గణతంత్ర వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో విశాఖలో రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లను అధికారులు రద్దుచేశారు. బీచ్ రోడ్డులో సన్నాహక పెరేడ్‌లో ఉన్న దళాలను వెనక్కి రావాలంటూ అధికారులు ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories