Amaravathi: 25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు

Amaravathi: 25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు
x
Highlights

ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది.

అమరావతి: ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఉగాది నాటికి మాట ఇచ్చినట్టుగా అందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోం ది. పట్టాల పంపిణీ మాత్రమే కాదు వాటిని లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తోంది.

25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు అంటే సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అందులో ఉన్న సిబ్బంది సరిపోరు. అందుకే ఈ ప్రక్రియలో రెవిన్యూ వ్యవస్థ లో కీలకమైన తహసీల్దార్ లను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ నిమిత్తం వారిని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు.. తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories