ఏపీలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా.. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లు

Andhra News: సుమారు రూ.6లక్షల విలువ చేసే బియ్యం పట్టివేత

Jyothi
Published on: 18 April 2023 12:43 PM IST
Ration Rice Mafia in Andhra Pradesh
X

ఏపీలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా.. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లు

Andhra News: ఏపీ లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఎన్టీఆర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అర్థరాత్రి గుట్టుచప్పుడు కాకుండా తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. తక్కువ రేటుకు బియ్యాన్నికొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. వారం క్రితం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో దాదాపు 190 క్వింటళ్ల బియ్యాన్ని అలాగే అక్కపాలెంలో 5లక్షల 85 వేలు విలువగల 15 క్వింటాళ్ల లారీ ని విజిలెన్స్ ల అధికారులు పట్టుకున్నారు. పలువురి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story