Ramatheertham incident: ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు

Ramatheertham incident: ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు
x
Highlights

Ramatheertham incident: * రామతీర్థం ధర్మయాత్రలో చోటుచేసుకున్న ఘటనలు,.. * సోము వీర్రాజుపై దాడి, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనలు * ఆర్డీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ఎదుట బీజేపీ నిరసనలు

Ramatheertham incident: ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. నిన్న రామతీర్థం ధర్మయాత్రలో చోటుచేసుకున్న సంఘటనలు, సోము వీర్రాజుపై దాడి, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనలకు దిగాలని నిర్ణయించుకుంది. అన్ని జిల్లాల ఆర్డీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ఎదుట నిరసనలు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించింది. రామతీర్థం ఆలయంలోకి బేషరతుగా అనుమతించాలంటూ కాకినాడలో జరిగే నిరసనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories