Rajahmundry IMA Doctors: మానవత్వాన్ని చాటుకుంటున్న రాజమండ్రి ఐఎంఏ వైద్యులు


Rajahmundry IMA Doctors: ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో గజగజ వణుకుతున్నాయి. ఈ వైరస్ నుంచి సమాజాన్ని రక్షించేందుకు డాక్టర్లు యోధుల పనిచేస్తున్నారు.
Rajahmundry IMA Doctors: ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో గజగజ వణుకుతున్నాయి. ఈ వైరస్ నుంచి సమాజాన్ని రక్షించేందుకు డాక్టర్లు యోధుల పనిచేస్తున్నారు. ఈ తరుణంలో కొవిడ్ రోగులపై కరుణ చూపి తమ మానవత్వాన్ని చాటుకోవడానికి ముందుకొచ్చిన రాజమండ్రి ఐ ఎం ఏ వైద్యులు ముందుకు వచ్చారు. 45రోజుల పాటు రాజమండ్రి- జిజిహెచ్ , జిఎస్ఎల్ కొవిడ్ ఆస్పత్రిలలలో రోజుకి రెండు షిప్ట్ లలో కరొనా రోగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) వైద్యసేవలు అందించనున్నది. కరోనా విజృంభన నేపథ్యంలో ఐ ఎం ఏ రాజమండ్రి శాఖ స్వచ్చందంగా ఈ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం.
ఈ సందర్భంగా ఐఎంఏ రాజమండ్రి శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రామరాజు, సెక్రటరీ డాక్టర్ పిడుగు విజయకుమార్,కోశాధికారి డాక్టర్ రామమోహన్ రావులు మాట్లాడుతూ.. సామాజిక బాధ్యత,సామాజిక స్పృహ తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విధుల నిర్వహణకు నేటి నుంచే 45రోజుల రోస్టర్ రూపొందించామని తెలిపారు. రోజుకి రెండు షిప్ట్ ల చొప్పున సేవలందిస్తున్నమనీ, ఒక్కొక్క షిష్ట్లో ఒక డ్యూటీ డాక్టర్, ఒక స్పెషలిస్ట్ ఫిజీషియన్, ఒక మత్తు (ఎనస్థీషియన్) డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు, జి.ఎస్.ఎల్ లో ఆరుగురు వైద్యులు విధులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం 2నుంచి 8గంటల వరకూ విధులు నిర్వహిస్తారని తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



