తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ ఫోకస్

Rahul Gandhi Focus On Andhra Pradesh
x

తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ ఫోకస్

Highlights

*ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి పునరుత్తేజం చేసేలా కీలక నిర్ణయాలు..!

Rahul Gandhi: ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి పునరుత్తేజంపై రాహుల్‌ గాంధీ దృష్టి సారించారు. ఏపీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసి.. కొత్త జవసత్వాలు నింపే దిశగా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ రావాలని ఆ పార్టీ హైకమాండ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏపీ కాంగ్రెస్‌లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఢిల్లీ పెద్దలతో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశంకానున్నారు. బుధవారం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో ఏపీ పీసీసీ సభ్యులు సమావేశమై.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories