శుక్రవారం నెల్లూరుకు రాష్ట్రపతి

శుక్రవారం నెల్లూరుకు రాష్ట్రపతి
x
Highlights

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు.. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్వర్ణభారతి ట్రస్ట్...

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు.. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి 9 గంటల 45 నిమిషాలకు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్తారు. అనంతరం 10 గంటల 50 నిమిషాలకు వెంకటాచలం మండలం సరస్వతి నగర్లోని అక్షర విద్యాలయం విద్యార్ధులతో మాట్లాడనున్నారు. 11 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు స్వర్ణభారతి వార్షికోత్సవంలో పాల్గొటారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి కోవింద్ చెన్నై వెళతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories