సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
* గోప్రదక్షిణ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గో తులాభారానిరకి సరిపడేలా విరాళం అందించారు
సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Madam President: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలిపిరి వద్ద ఉన్న సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం అలిపిరి వద్ద ఉన్న మందిరం వద్దకు చేరుకున్న ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ వేణుగోపాలస్వామి దర్శనం అనంతరం గోప్రదక్షిణ చేశారు. గోవులకు అరటిపండ్లు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం గోతులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన 6 వేల రూపాయలను రాష్ట్రపతి గోమందిరం అధికారులకు అందజేశారు.
Next Story




