చంద్రబాబుకు మరో షాక్... ప్రజావేదిక స్వాధీనం

చంద్రబాబుకు మరో షాక్... ప్రజావేదిక స్వాధీనం
x
Highlights

ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల...

ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల సదస్సు కోసం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజావేదికను పరిశీలించారు. కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో ప్రజావేదికను ఖాళీ చేయాలని సీఆర్డీఏ అధికారులు టీడీపీని ఆదేశించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ప్రజావేదిక ఉంది. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు సమావేశాల కోసం ప్రజావేదికను వినియోగించుకునే వారు. ప్రజావేదికను టీడీపీకి కేటాయించాలని ఇటీవల చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. అయితే, ఈనెల 24న కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories