ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల కష్టాలు తెలిసిన మనిషి : ప్రధాని మోదీ సోదరుడు

ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల కష్టాలు తెలిసిన మనిషి : ప్రధాని మోదీ సోదరుడు
x
Highlights

ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, ప్రముఖ సామాజికవేత్త ప్రహ్లాద్‌ మోదీ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ద్వారకా తిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల,...

ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, ప్రముఖ సామాజికవేత్త ప్రహ్లాద్‌ మోదీ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ద్వారకా తిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారని.. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని అన్నారు. వీరికి ఆర్థిక, రాజకీయ రంగాల్లో తోడ్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని కితాబిచ్చారు. త్వరలోనే సీఎం జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి ఈ సామాజిక వర్గీయుల సమస్యలను తీసుకెళ్తానని చెప్పారు. కాగా ద్వారకా తిరుమలలోని దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, పూజలు నిర్వహించారు ప్రహ్లాద్‌ మోదీ. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories