మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసు కేసు నమోదు!

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసు కేసు నమోదు!
x
చింతకాయల అయ్యన్నపాత్రుడు
Highlights

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీస్ కేసు నమోదైంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీస్ కేసు నమోదైంది. గతంలో పోలీసులను దూషించిన కేసులో అయ్యన్నపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని నర్సీపట్నం టౌన్ సీఐ స్వామినాయుడు స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడి సోదరుడు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన సన్యాసినాయుడు, తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టారని.. అయితే ఈ విషయమై ఈ నెల 12న అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని సీఐ తెలిపారు. ఇరు వర్గాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, తాము బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

అయితే ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించేలా అయ్యన్నపాత్రుడు, పోలీసులనుదూషించారని, దీనిపై కేసును రిజిస్టర్ చేసినట్టు వెల్లడించారు. కాగా, నర్సీపట్నం మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఆయన అన్న అయ్యన్నపాత్రుడు ఒకే ఇంట్లో ఉంటూ వేరు వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. తమ్ముడు వైసీపీలో చేరడంపై అయ్యన్న గుర్రుగా ఉన్నారు. దాంతో వీరి మధ్య క్యాడర్ ఇబ్బందులు పడుతోన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories