గ్రహణ సమయంలో నిలబడిన రోకలి

గ్రహణ సమయంలో నిలబడిన రోకలి
x
Highlights

తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ.

తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్లేట్ లో నీళ్లు పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిందో మహిళ.

ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో చోటుచేసుకుంది. సూర్యగ్రహణం రావడంతో.. గ్రామానికి చెందిన తాడ్డి మంగమ్మ అనే మహిళ.. తమ ఇంటి వద్ద కంచు పళ్లెంలో పసుపు నీరు పోసీ రోకలి నిలబెట్టారు. కొంతసేపు ఆ రోకలి అలాగే నిలబడింది. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతుందని వారి నమ్మకం.

ఈ సందర్బంగా నిలబడిన రోకలి బండకు చిన్నారుల చేత గుంజీలు తీయించారు. అలా చేస్తే చేసిన తప్పులను సూర్యభగవానుడు క్షమిస్తాడని వారు నమ్ముతున్నారు. దీనిని చూడటానికి గ్రామంలోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories