రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ డిసెంబర్ 12 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేయాలని ప్రజలను కోరారు.
రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ డిసెంబర్ 12 న కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేయాలని జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రజలను కోరారు. పార్టీ అధ్యక్షుడికి మద్దతు తెలియజేయడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కాకినాడకు రావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాల రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, దాంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్ వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తరుణంలో అక్కడ అనేక అవకతవకలు జరిగినట్టు గుర్తించారని అన్నారు. వారి సమస్యలకు పరిష్కారం కోసమే పవన్ కళ్యాణ్ ఒకరోజు రాహార దీక్ష నిర్వహిస్తున్నారని మాజీ స్పీకర్ తెలిపారు. కాగా గుడివాడలో ఉల్లిపాయలు కొనడానికి క్యూలో నిలబడి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి సాంబి రెడ్డి మరణించాడని.. ఇది నిజంగా దారుణమని మనోహర్ పేర్కొన్నారు. ఉల్లి సంక్షోభాన్ని పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire