సచివాలయ పేపర్ లీకేజీ వార్తలపై మంత్రి వివరణ

సచివాలయ పేపర్ లీకేజీ వార్తలపై మంత్రి వివరణ
x
Highlights

సచివాలయ పేపర్ లీకేజీ వార్తలపై మంత్రి వివరణ సచివాలయ పేపర్ లీకేజీ వార్తలపై మంత్రి వివరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని వస్తున్న ఆరోపణలు స్పందించారు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రశ్నాప్రతాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదని వివరణ ఇచ్చారు పెద్దిరెడ్డి. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు లోనవద్దని ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories